శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ గారి ఉత్తర్వుల ప్రకారం 1 నుండి 9వ తరగతి చదివే విద్యార్థులందరికీ ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు 22 /23 ఏప్రిల్ 2022 న జారీ చేయవలసి ఉంటుంది.
ఇందుకుగాను ప్రతి ఒక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫార్మేటివ్ 1,2 సమ్మేటివ్ 1,2 మార్కు లతోపాటు విద్యార్థులు పాఠశాలకు హాజరు అయిన రోజులు సహపాఠ్య అంశాల మార్కులు గ్రేడ్లు విధి గా నమోదు చేయాలి.
ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ నందు www.schooledu.telangana.gov.in website నందు అన్ని కాలములలో అన్ని మార్కులు హాజరు నమోదు చాలా వరకు పాఠశాలలు చేయలేదు. ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా భావించి సమ్మేటివ్ 2 మార్కులు సైతం జవాబు పత్రాలను వెంట వెంటనే మూల్యాంకనం చేసి అప్లోడ్ చేయాలి.ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించేoదుకు అయ్యే ఖర్చును పాఠశాలకు విడుదలైన కాంపోజిట్ స్కూల్ గ్రాంటు నుండి భరించాలి.
ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డు తప్పనిసరిగా జారీ చేసి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారులకు తద్వారా జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలి.
No comments:
Post a Comment