మ్యూచువల్ అప్లై చేసుకున్న టీచర్లు ఎవరు గందరగోళానికి గురికావద్దు.


మ్యూచువల్ అప్లై చేసుకున్న టీచర్లు ఎవరు గందరగోళానికి గురికావద్దు.


మ్యూచువల్ అంశం ప్రస్తుతం కోర్ట్ పరిదిలో ఉన్నందున దానిపై ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదని,కేవలం మ్యూచువల్ అప్లై చేసుకున్న టీచర్ల వివరాలు మాత్రమే సేకరించమని తెలియజేశామని,ఇది టీచర్ల నుండి అండర్ టేకింగ్ కాదని జీరో సర్వీస్ కు ఒప్పుకుంటున్నట్లు అండర్ టేకింగ్ కొరకే వెరిఫికేషన్ అనే వదంతులను నమ్మవద్దని విద్యాశాఖ ముఖ్యఅధికారి ఒక్కరు తెలియజేశారు. 

నిన్న,ఈ రోజు మండలాల వారీగా మ్యూచువల్ టీచర్ల సర్వీస్ బుక్కులు వెరిఫికేషన్ చేసి,ఫ్రొఫార్మాలు నింపి పంపమని MRC ల నుండి మెసేజ్ రాగానే మ్యూచువల్ అప్లై చేసుకున్న ఉపాధ్యాయులందరు అధికారులు ఇచ్చిన ఫ్రొఫార్మాలు నింపి ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం సదరు ఉపాద్యాయులు వివరాలు అప్లికేన్ట్ A, అప్లికేన్ట్ B ఏ జిల్లా నుండి ఏ జిల్లాకు వెళ్లుటకు ఒప్పందం చేసుకున్నారు. ఆయా ఉపాద్యాయులపై ఏమైనా పోలీస్ కేసులు గాని శాఖాపరమైన చర్యలు పెండింగులో ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా పరిష్కారించాలి అనే అంశాల వివరాల కొరకు మాత్రమే తప్ప సర్వీస్ జీరో అయిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అండర్ టేకింగ్ మాత్రం కాదని ఉపాధ్యాయ మిత్రులు గ్రహించాలి.

సోమవారం కోర్టు తీర్పును అనుసరించి మాత్రమే అధికారులు కోర్టు తీర్పుకు లోబడి మాత్రమే నిర్ణయం తీసుకొని కొత్త జిల్లాలకు కేటాయించే అవకాశం ఉన్నది. కొందరు సంఘనాయకులు ఉపాధ్యాయులను అనవసరం వాట్సాప్ మెస్సేజీలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని సదరు విద్యాశాఖ ముఖ్యఅధికారి తెలిపినారు.ఈ రోజు సాయంత్రము విద్యాశాఖ ముఖ్యఅధికారులతో సమావేశం జరుగనున్నట్లు కూడా తెలుస్తుంది.









No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner