సెప్టెంబర్ 13 న చలో అసెంబ్లీ - యుయస్పీసీ.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, 317 బాధితులకు న్యాయం, విద్యావాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యుయస్పీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి హైదరాబాద్ ధర్నా చౌక్ నందు నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహారదీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
రోజుకు 50 మందితో శాంతియుతంగా చేసే నిరాహారదీక్షలకు కూడా అనుమతించలేని పోలీసుల నిరంకుశ వైఖరిని యుయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అందుకు నిరసనగా మరియు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 13న చలో అసెంబ్లీ జరపాలని యుయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.
సమయం తక్కువగా ఉన్నది అయినా అనివార్యంగా ఈ కార్యక్రమం తీసుకోవలసి వచ్చిన అగత్యాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుని సెప్టెంబర్ 13 నాడు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ తరలివచ్చి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని కోరుతున్నాము.
వందనములతో....
స్టీరింగ్ కమిటీ
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ)
No comments:
Post a Comment