ఈ నెల 28 కు Go.317 లో కోల్పోయినా స్థానికత సాధించుటకై చలో హైదరబాద్ బాధితుల సంఘం పిలుపు

ఆగస్టు 28, 2022 ఆదివారం రోజున ఇందిరా పార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జీవో 317 రాష్ట్ర బాధితుల సంఘం అనుమతి తీసుకోవడం జరిగింది. కావున ఉపాధ్యాయ మిత్రులందరికీ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయగలరని మనవి.



కేంద్రానికి చేరిన 317GO వివాదం

రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా(ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా)తీసుకువచ్చిన Go 317 ఉద్యుగుల పాలిట శరాఘాతంగా మారడంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం,కొందరు ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతున్న విషయం.అయితే ఇక్కడ ఉద్యోగులు మాత్రమే ప్రభుతానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కొందరు చెబుతుంటే మరి కొందరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోషనియం.అసలు 317జీఓ లో స్థానిక ఆంశము విస్మరించి సినియర్టిని తెరపైకి తేవడం వల్ల సినియర్లైన సంఘనాయకులు లబ్ధి పొందడం వల్ల,ప్రభుత్వం ఒక్కటి,రెండు సంఘ నాయకులకు,రానున్న కాలంలో MLC వంటి పదవులను చూపడం వల్ల వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉద్యోగులు బాహాటంగానే చేస్తున్నారు. జూనియర్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల స్వంత జిల్లాను వదిలి దూర జిల్లాలకు వెళ్ళవలసిన ప్రరిస్తితులు రావడం వల్ల పిల్ల,పాపలతో అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయడం చాలా భారమైన అంశం.పైగా భార్య,భర్తలను ఒక్కే జిల్లాకు పంపే విధానానికి కూడ తిలోదకాలు ఇవ్వటం మొదలైన అంశాలతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
xx
ఉద్యగుల ఉద్యమానికి మద్దతుగా బీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక్కరోజు జాగరణ దీక్షకు పూనుకోవడం ,అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా కేసులు పెట్టడం తరువాత హైకోర్టు లో బెయిల్ రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్రానికి చేరి బిజెపి జాతీయ అధ్యక్షులు రాస్తేన్ని సందర్శించడమే కాక గౌరవ ప్రధాన మంత్రి గారు స్వయంగా బండి సంజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్తితి తెలుసుకోవడం తో 317జీఓ బంతి కేంద్ర కోర్టు లోకి వెళ్లిందని రాజకీయ విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ అధికారాలు ఉపయోగించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయవచ్చునో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.అటువంటి అవకాశమే వున్నట్లయితే 317జీఓ రద్దు అయ్యే అవకాశమున్నది.
రాష్ట్రప్రభుత్వం మాత్రం కోర్టు కేసును ఏమాత్రం పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేసి కొత్తగా అలట్ అయిన స్థానాలలో చేరి పోవాలని చెప్పడం తో విధి లేని పరిస్థితుల్లో ఉద్యోగులు కొత్త స్థానాలలో చేరిపోయారు. 
కేంద్ర ప్రభుత్వ జోక్యం తో 317 జీఓ రద్దయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఉపాధ్యాయులు,ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేస్తే తప్పనిసరిగా ఫలితముంటుందని రాష్ట్రపతి ఉత్తర్వులు కేవలం 31 జిల్లాలకు మాత్రమే సంబంధించినవి 33జిల్లాలకు వాటిని వర్తించడం కుదురదని,హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు తెలియజేశారు.

కాబట్టి మిత్రులారా!పట్టువదలని విక్రమార్కుడిలా ఉద్యమాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అండగా వుండి 317జీఓ రద్దయ్యే అవకాశముంది.
xx
పోరాడితే పోయేది ఏమి లేదు 317జీఓ రద్దు కావడం తద్ద్యం.

హైకోర్టు లో కేసు విచారణ 18వ తారీకు కు వాయిదా వేయడం తో ప్రభుత్వం కూడ 18 వరకు వేచి చూసి ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి 317 జీఓ రద్దుకు నిర్ణయము తీసుకోనున్నదని తెలుస్తోంది.




No comments:

Recent Updates

Email subscribe

Enter your email address:

Delivered by FeedBurner