*🪴🥦Telangana News: గ్రూప్-1, 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. స్టైఫండ్ ప్రకటన
*🥦🍃హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న వేళ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది. ఈ క్రమంలో ఉచిత శిక్షణ కోసం మంత్రి గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. వార్షిక ఆదాయం రూ.5లక్షల్లోపు ఉన్నవారు ఇవాళ్టి నుంచి ఈ నెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 16న ఆన్లైన్లో ఎంపిక పరీక్ష నిర్వహించి 21 నుంచి 1,25,000 మందికి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు*
*🪴గ్రూప్-1, గ్రూప్-2 రాసే 10వేల మంది అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థులకు 6నెలల పాటు నెలకు రూ.5వేలు, గ్రూప్-2 అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2వేలు, ఎస్ఐ అభ్యర్థులకు నెలకు రూ.2వేల స్టైఫండ్ ఇచ్చేందుకు నిర్ణయించామని గంగుల కమలాకర్ ప్రకటించారు*
No comments:
Post a Comment
Need Suggestions