WhatsApp లోవైరల్ అవుతున్న మల్కాజ్ గిరి మేడ్చల్ జిల్లాలోని ఉపాధ్యాయులు హైకోర్టులో వేసినcase పై వివరణ ...
కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కేసు వివరాలు తెలుసుకోవాల్సిందిగా మమ్మల్ని కోరడం జరిగింది. మిత్రులందరి కొరకు ఈ చిన్న వివరణ. .. తెలంగాణ ప్రభుత్వం GO.317 కు అనుబంధంగా జిల్లాకు ALLOCATE అయిన మొత్తం ఉద్యోగులకు బదులు కొత్తగా జిల్లాకు allocate అయిన వారిని మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయాలని Memo 1655/spf 23.12.2021 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మెమో రాజ్యాంగ విరుద్ధమని మేడ్చల్ జిల్లాకు చెందిన 20మంది ఉపాధ్యాయులు wp no 857/2022 dt.20.01.2022 ద్వారా హైకోర్టును ఆశ్రయించడం ప్రభుత్వం సరైన టైంలో స్పందించకపోవడంతో వాళ్ల ఫేవర్ గా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తూ 16.02.2022రోజున ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ కూడా వైరల్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. ఈ కేసు పూర్వాపరాలు తెలుసుకొనుటకు హైకోర్టును ఆశ్రయించిన పూసల అశోక్ మరియు 19మంది ఉపాధ్యాయుల లో ఇద్దరు ఉపాధ్యాయులను కేసు పూర్వాపరాలు తెలుసుకోవడానికి సంప్రదించడం జరిగింది. వారు dt. 20.01.2022 రోజున ప్రభుత్వం ఇచ్చిన మెమో కు వ్యతిరేకంగా case వేయడం జడ్జిమెంట్ కూడ dt.16.02.2022 రోజున వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనీ,respondents అందరికీ కూడా వారు వ్యక్తిగతంగా కోర్టు ఉత్తర్వులు అందజేయడం జరిగిందనీ కానీ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకుఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనీ తెలియజేశారు. ఆ తరువాత ప్రభుత్వం కూడా memo కు అనుగుణంగా కారణాలను తెలియజేస్తూ కేసుపై కౌంటర్ దాఖలు చేసిందని తెలియజెప్పారు. కేసు మరల ఏప్రిల్ 6వ తేదీన hearing కు ఉందని తెలియజేశారు. (కోర్టు ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి డైరెక్షన్స్ వచ్చిన అవి individual orders గానే పరిగణించబడ తాయి అందరికీ జనరలైజ్ చేయడం జరగదు) . ఏది ఏమైనా 317 GO ద్వారా నష్టపోయిన majority ఉపాధ్యాయులందరికీ న్యాయం జరగాలి.ఏప్రిల్ 6 వ తేదీ రోజున జడ్జిమెంట్ వస్తుందా లేక మరలా ఏమైనా వాయిదా పడుతుందా వేచి చూడాలి...
No comments:
Post a Comment